*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Showing posts with label బాలోత్సవ్ కథారచన -2010. Show all posts
Showing posts with label బాలోత్సవ్ కథారచన -2010. Show all posts

Sunday, May 22, 2011

అయ్యో ప్రకృతి!


(బాలోత్సవ్ -2010  కవితారచన లో ప్రథమ బహుమతి పొందిన కవిత )


అయ్యో ప్రకృతి!

చక చకా గాలిలోకి
ఎగిరిన మామిడి చెట్టు
మా ఇంటి మబ్బున ఉంది

వేసవి కాలం ప్రారంభమున ,
ఇంటికి వచ్చే అథిది దేవుళ్ళ మీద
 పూల వర్షం కురిపించి
 స్వాగతం పలుకుతుంది

ఆ కాలమున కొన్ని కాంతులు
చెట్టు నుంచి విస్తరించాయి
అవే మామిడి పండ్లు ,
మన కాంతులు

ఒహో ఎంత పుల్లగా ఉన్నాయో !
అనిపించినా ,ఒకటి గుర్తుకు రాక తప్పదు
తీపుంది పులుపుంది భేదం వేరే ఉంది
"పులుపన్నది ఉన్నపుడే కదా తీపి!"

అవి కిందికి రాలి
మా ఇంటిని మొత్తం
వెలుగుల మయంగా మార్చేసింది

ఇంత ఇచ్చినా ఎంత ఇచ్చినా దానికి
ధన్యవాదాలు చెప్ప మరిచాను

అందుకే ప్రకృతికి ,
చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పాను.
కానీ,
అది నాకు ఎన్ని ఇచ్చినా గానీ,
 అదే నాకు కృతజ్ఞతలు చెప్పాలి.

ఎందుకంటే 
నేను తిన్న వెలుగులలో
 ఉన్న టెంకెను మబ్బుల్లోకి వదిలేసాను కాబట్టి .
ఎందుకంటే ,
కొత్త జీవం మొలుస్తుంది కాబట్టి.

అయ్యో ప్రకృతి!
ఇటు నాతో ధన్యవాదములు చెప్ప లేకా,
అటు నేనూ చెప్పక ,
ఒక చిక్కులో చిక్కుకుంది.


Token no.55 Class 7 ,BaalOtsav, kottagudem -2010


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Sunday, December 19, 2010

అంతు పట్టని ఏ సానుభూతి

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ద్వితీయ బహుమతి పొందిన జి.శ్రీరాం , 9 వ తరగతి ,భద్రాచలం పబ్లిక్ స్కూల్ ,సారపాక ,ఖమ్మం జిల్లా ,రచన ఇప్పుడు చదవండి.
***

అంతు పట్టని ఏ సానుభూతి 
నా పేరు మోగ్లి .నేను బెంగాల్ పులుల జాతికి చెందిన ఒక పులిని .
 పులులజాతికి చెందిన మేను స్వతంత్ర జీవులం . మా మంద నాయకుడికి తప్ప మేమెవరి మాట విని ఎరగం .మా కంటూ పాటించ వలసిన నియమ నిబంధనలు మా పెద్దలు ఎప్పటినుంచో చాలా ఆలోచనలతో స్థాపించారు. ఈ నియమ నిబంధనలను మేము తూ చా తప్పకుండా పాటించేవాళ్ళం.
కానీ అప్పుడప్పుడే ఒక శక్తి ఉన్నతశిఖరాలకు చేరుకుంటున్నది.  అదే మానవ శక్తి . ఆ  మానవులంతా మేము ఉంటున్న ప్రదేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారు.
అప్పటిదాకా కాల హయైగా ,సుఖశాంతులతో గడిచింది. ఈ అడవి మాది ,ఈ నేల మాది. ఇది మా ప్రదేశం అని జీవిస్తున్న సంధర్భంలో ఈ మానవులు మా మీద దాడులు జరిపారు.
 కనిపించిన ప్రతి చెట్టు  ప్రతి పుట్ట  గొడ్డళ్ళతో నరికారు.
అడవిలో జంతువుల్ని ఎడాపెడా వేటాడారు.అడవి నియమాల ప్రకారం ఎవరినీ అకారణంగా వేటాడకూడదు.  ముఖ్యంగా మా నియమాల ప్రకారం మనుష్యుల్ని వేటాడకూడదు. మా దృష్టిలో మనుషులు జంతువులందిరిలో బలహీనమైన వాడు. మనుషుల్ని వేటాడంలో మజా ఉండదు. అంతే కాక నరమాంస భక్షణ వలన జంతువుల కోరల పటుత్వం తగ్గి పోతుంది.  కానీ ,ఈ మధ్య మనుషులు ఏనుగులమీదకెక్కి గోధుమ చర్మం వారిని వెనకేసుకొచ్చి ,జంతువుల చర్మాలు కోస్తున్నారు.
ఇలాంటప్పుడు మనుషుల మీద దాడి చేయచ్చును. మనుషుల దుష్ప్రవర్తన చూసి మేము సహించలేకపోయాము. మనుషుల్ని వేటాడడానికి ముందుకొచ్చాం.మనుషులమీదికి దూకి మరీ వారిని కసితీరా చంపాం. దాంతో ఆ మనుషులంతా కుయ్యో మొర్రో అంటూ అడవి నుంచి పారిపోయారు. అక్కడితో అయిపోయిందనుకొని హాయిగా బతక సాగాం.
కానీ, మనుషుల పగ మాత్రం చల్లార లేదు. చాలా ఏళ్ళవరకు మా మీద ఏదాడీ జరగలేదు.కానీ మనుషులు మాత్రం తమ బుద్ధిబలంతో చాలా ఆయుధాలను రసాయనాలను సృష్టించారు.  భూమిలోని ఖనిజాలను దోచుకొని చాలా నిర్మించారు.
అప్పటికే మా జంబూ ద్వీపాన్ని కొంతమంది తెల్ల వాళ్ళు వలసచేసుకొన్నారు.
వాళ్ళు నిర్మించిన ఆయుధాలతో మా మీద మళ్ళీ దండయాత్ర కొనసాగించారు.

ఈ సారి మా వీరత్వం వాళ్ల ముందు ఏమాత్రం  సరిపోలేదు. కనిపించిన ప్రతి పులినీ కసితీరా చంపారు. ఒక నాయకుడిగా నేను కూడా వాళ్ళను ఎదుర్కొన్నాను. కానీ, నా శక్తి సామర్థ్యాలు వాళ్ళముందు సరిపోలేదు. ఒక పక్కన నా బంధువులు ,నా స్నేహితులు అందరు మనుషుల చేతిలో అధోగతి పాలవుతున్నారు. ఎలాగైనా సరే మేము జీవించాలి. నేను మా మందలో మిగిలిన వారితో కలిసి పారిపోయాను.
నేను మిగతావాళ్ళతో కలిసి పారిపోయునప్పుడు ,నా పై నాయకుడ్ని వాళ్ళు బంధించారు.
తెల్లదొర ఒకడు తుపాకీ తో మా నాయకుడ్ని చంపి ,దాని మొహం మీద కాలు పెట్టి వీరోచితంగా నించున్నాడు.

ఇది చూసి మాలో కసి బాగా పెరిగింది.కానీ ,అక్కడి నుంచి పారిపోయాము.
ఇప్పటివరకు నేను నాతో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకున్నాను.
కానీ, మనుషులందరూ చెడ్డవాళ్ళన్న భ్రమలోనే ఉన్నాను.
తరువాత తెలిసింది. మనుషుల్లో కొంతమంది మంచివాళ్ళున్నారని.కొంతమంది జంతుప్రేమికులున్నారనీ . వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళు తయారు చేసిన అడవుల్లో ఉంచారు.
కానీ, కొంతమంది ఇప్పటికీ వేటాడం మానలేదు. అయినా సరే , ఎవరికీ లొంగకుండా అక్కడే నేను నా మందను కాపాడుకొంటున్నాను.

***

Photo courtesy:
http://www.thewareaglereader.com/2010/09/something-resembling-plainslinks-tiger-cub-edition/
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, November 23, 2010

ఒక చిన్న గాంధి

 బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ద్వితీయ  బహుమతి పొందిన  కె. అభిజ్ఞ ,
6 వ తరగతి ,   రచన.
***
ఒక చిన్న గాంధి 
***

ఒక రోజు నేను పాఠశాల నుండి వస్తుండగా  నాకు గాంధి వేషంలో చిన్న కుర్రాడు కనిపించాడు . నేను అతన్ని చూడగానే పాఠశాలలో వేషం వేస్తున్నాడు అనుకొన్నాను
కానీ, తీరా చూస్తే ,అతను ఒక భిక్షగాడు. అతను డబ్బులు అడుగుతున్నాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఎందుకు డబ్బులు కావాలి?
అప్పుడు నేను చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగాను," నీవు ఎందుకు డబ్బులు అడుగుతావు  వాటితో నీకు ఏమి అవసరం ? ఎందుకు వేషం వేసుకొని డబ్బులు అడూగుతున్నావు? " అని అడిగాను
అప్పుడు చిన్న కుర్రాడు ఇలా సమాధానం ఇచ్చాడు. "నా పేరు సోము. నా వయసు ఏడేళ్ళు . నాకు మీలాగానే పిల్లందరితో కలిసి పాఠశాలకు వెళ్ళి ఆడూకొని ఆనందాలు ,బాధలు అన్ని విషయాలు పంచుకోవాలి అనిపిస్తుంది . కానీ దురదృష్టవశాత్తు , నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. మా అమ్మానాన్నలు నన్ను ఎంతో ప్రేమగానో చూస్తారు. కానీ ,మా కుటుంబం ఒక బువ్వ కూడా నోటిలో పెట్టలేని పరిస్థితి లో ఉన్నది.
మా నాన్నకి నేను నాలుగు ఏళ్ళప్పుడే పక్షవాతం అచ్చింది. మా అమ్మ ఏమీ చేయలేక చిన్న చిన్న ఇంట్లో పని చేస్తుంది. రోజుకి పదిరూపాయలు కూడా రావడం లేదు. ఇక నేను బాధలు భరించ లేక ఇలా వీధుల్లో వేషాలు వేస్తూ కొన్ని మాటలు చెపుతూ ,ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను.
కానీ, నేను ఏమాత్రం డబ్బులతో సరిపడ లేక పొతున్నాను.నాకు చదువుకోవాలని ఆశగా ఉంది. కాకపోతే నా పరిస్థితి అలాంటిది కాదు."
అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను." నువ్వు గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళి చదువుకోవచ్చు కదా?" అని అన్నాను.
"నేను చదువుకొంటే నా కుటుంబాన్ని పోషించేవారు ఎవరు ?"అని ఏడుస్తూ అన్నాడు.
అప్పుడు నాకు అతన్ని చూడగానే ఇలాంటి వారు ఎంతమందో ఉంటారు .నాకు ఏదో చేయాలి అనే తపన ఏర్పడింది. "వాళ్ళే రేపటి మనదేశానికి పౌరులు కావచ్చు " అని అనిపించింది
అపుడు నేను మా తల్లిదడ్రుల దగ్గరికివ్ ఎళ్ళి మా నాన్న తో ఇలా అన్నాను. " నాన్నా ,నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నన్ను మన కుటుంబాన్ని పోషిస్తున్నావు. నన్ను చదివిస్తున్నావు. కానీ, పేద కుటుంబంలో పుట్టిన పిల్లల సంగతి ఏమిటి ?
వాళ్ళు చదువుకోలేరు కదా.రోజూ పనిచేయాలి. వాళ్ళని మనం చదివిద్దామా?'" అని అడిగాను.
" నీ ఆలోచన బావుంది . కానీ ,నేటికాలంలో చదివిస్తా అని పిలిచినా రానటువంటి పరిస్థితిలో ఉన్నారు . వాళ్ళకి చిన్నగా చదువు మీద ఉన్న శ్రద్ధ పోతుంది .  వాళ్ళకి అలా గాలికి తిరగడమే నచ్చేస్తది "" అని అన్నారు.
నిజంగానే సోముకి రెండు నెలల తరువాత చదువు మీద శ్రద్ధ వెళ్ళిపోయి ,అలా వేషాలతోనే తిరిగాడు. అతనికి రోజుకి 50 ఎక్కువనే డబ్బులు వస్తున్నాయి .
కానీ, అతను చదువుకోవడం లేదు.
నాకు అర్ధమైంది ఏమిటంటే, పరిస్థితులను బట్టి , కాలాలను బట్టి , మనుషులుకూడా మారుతారు.

***
బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో 2 బహుమతి పొందిన  కె. అభిజ్ఞ ,6 వ తరగతి , తేజ టాలెంట్ స్కూల్, కోదాడ ,నల్గొండ జిల్లా. 
రచన.
13-11-2010.

Prabhava,Books and Beyond ! * All rights reserved.

Saturday, November 20, 2010

అడవిలో బాలుడు



wallpaperstock.net
  బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందినఎం. శ్రీకాంత్ ,మణుగూరు   చన .
 అడవిలో బాలుడు

***
అనగనగా ఒక ఊరిలోఒక రాజు అనే అబ్బాయి ఉండే వాడు. ఊరికి దగ్గరగా ఒక చిట్టడవి ఉండేది. రాజునాన్న అడవికి వెళ్ళి తేణె సేకరించేవాడు
ఒక సారి రాజు నాన్నకు బాగా జ్వరం వచ్చింది
రాజు నాన్న ," అడవికి వెళ్ళి నువ్వు తేనె తేవాలిఅప్పుడే మనం డబ్బు సంపాదించుకోవాలిఅన్నాడు.
రాజు ఒక బుట్టను ,కత్తిని ,అగ్గిపెట్టెను తీసుకొని అడవికి వెళ్ళాడు
అతడికి తేనె తెట్ట కనిపించ లేదు
సాయంత్రం అయినా అతనికి తేనెతెట్ట కనిపించలేదుఅతడు ఇక వెళ్ళి పోదాం అనుకొన్నాడుఅతనికి దారి తెలియదు.  

తేనె కోసం అతడు అడవి మొత్తం తిరుగుతూ ,ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ,సేద తీర్చుకొన్నాడు
రోజు రాత్రి అతడు అక్కడే ఉన్నాడు, రాజు నాన్న అతడు ఇంకా రాలేదని అడవిలో ఏదైనా మృగం అతన్ని చంపేసిందేమో నని భయపడ్డాడు
రోజు రాత్రి అతనికి నిద్ర పట్టలేదు.  
bengalnewz.blogspot.com
రాజు అడవిలో తప్పి పోయాడు. రాజుకు బాగా చలి వేసే సరికి ,తన దగ్గర ఉన్న కత్తితో ఎండు కట్టేలు నరికి అగ్గిపెట్టెతో మంట వేశాడు. కొంతసేపు నిద్రపోయాడు
పొద్దున్నే లేచి తన ఇంటికి వెళదాం అనుకొన్నాడు.
రాజు నాన్న జ్వరంతో ఉండడంతో తన కొడుకును వెతకడానికి రాలేక పోయాడు
రాజు అడవిలో మళ్ళీ తేనె తుట్టెలు వెతికాడు. సారి అతనికి తేనె తుట్టె కనిపించింది. మంటపెట్టి తేనె టీగలను తరిమి ,తెట్టెబు కత్తితో కోసి ,తేనెను బుట్టలోకి పిండాడు. మధ్యాహ్న సమయంలో రాజు తేనె తాగి ఆకల్ని తీర్చుకొన్నాడు
అక్కడ వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడని రాజు బాధ పడ్డాడు
రాజు మూడిటిని తీసుకొని ,ఒక దగ్గర కూర్చుని ,కత్తితో కట్టే పుల్లలను నరికి ,ఒక డేరాలాగా ఏర్పాటు చేసుకొన్నాడు. ఎందుకంటే రోజు సాయంత్రం వర్షం బాగా కురిసింది
ప్రొద్దున్నే లేచి రాజు ఆలోచించి ,"నేను అడవికి వచ్చినప్పుడు కత్తిని ఒకసారి, బుట్టను ఒకసారి నేల మీద అప్పుడప్పుడు పెట్టాను.అంతే గాక అగ్నిని కూడా మండించాను."
గుర్తులను వెతుకు కుంటూ అడవి మొత్తం తిరుగగా ,అతనికి ఒక దగ్గర అతడు కాల్చిన కట్టె పుల్లలు కనిపించి , దారినే ఇంటికి వెళ్ళగా ,బుట్టగుర్తు కత్తి గుర్తు ఉంది
అక్కడినుంచి అతడు వెళ్లి పోయాడు.
అతడు ఒకవేళ మూడు వస్తువులను ఉపయోగించకపోయుంటే , అతడు ఇంటికి చేరుకొనే వాడు కాడు
ఇంటికి వచ్చిన అతనిని చూసి వాళ్ళ నాన్న ఎంతో సంతోషించాడు.
***
బాలోత్సవ్  కథారచన -2010 లో జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి పొందిన రచన.
13-11-2010.

Prabhava,Books and Beyond ! * All rights reserved.